Header Banner

ఆ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది.. కనీసం ఒక్క రోజన్నా.! అర్జున్ రెడ్డి హీరోయిన్..

  Sat Apr 12, 2025 16:02        Entertainment

విజయ్ దేవరకొండ మూవీ 'అర్జున్ రెడ్డి' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని మంచి గుర్తింపు పొందింది. షాలినీ పాండే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో రేస్ లో ఆమె వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా తనకు ఏ హీరోతో నటించాలని ఉందో షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి నటించాలనేది తన కోరిక అని షాలినీ పాండే చెప్పింది. అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని, నటనలో ఒక మాయ ఉంటుందని తెలిపింది. రణబీర్ తో కలిసి ఒక్క రోజైనా పని చేయాలనేది తన కోరిక అని చెప్పింది. ప్రతి సినిమాలో రణబీర్ నటనలో మార్పు కనిపిస్తుందని కితాబునిచ్చింది. అతడిలో ఏదో మాయ ఉందని అనిపిస్తుంది. తెరపై అతడితో కలిసి నటించాలని.. ప్రేమలో పడేందుకు ఆసక్తిగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనను ఎక్కువగా అలియా భట్ తో పోలుస్తారని.. ఆ విషయం తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది. అలియా భట్ అద్భుతమైన నటి అని.. ఇండస్ట్రీలోకి మరో అలియా అవసరం లేదని తెలిపింది. తనకు ఒక నటిగా గుర్తిస్తే చాలని తెలిపింది. ప్రస్తుతం ఆమె ధనుష్ నటిస్తోన్న ఇడ్లీ కడై మూవీలో కనిపించనుంది.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting